కార్పొరేట్ ట్యాక్స్ ప్రతిపాదనలు మాత్రమే
- December 25, 2015
కార్పొరేట్ ట్యాక్స్లపై ప్రతిపాదనలు జరుగుతున్న మాట వాస్తవమేనని, వ్యక్తిగత ఆదాయంపై ఎలాంటి పన్నులు విధించడంలేదని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ వర్గాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనంతో ఆదాయం గణనీయంగా తగ్గడంతో ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు పన్నులు విధించడమే మార్గమని కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గరకు వెళ్ళాయి. వీటిల్లో కార్పొరేట్ ట్యాక్స్పై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుండగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో కూడా చర్చ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. అయితే ఆయిల్ ధరల పతనంతో బడ్జెట్పై ఏమాత్రం ప్రభావం ఉండదని, ఏ ప్రాజెక్ట్ని కూడా ఈ కారణంగా ఆపివేయడంలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఒప్పుకుంటే విలువ ఆధారిత పన్ను 2018 లేదా 2019 నుంచి అమల్లోకి రావొచ్చని ఫైనాన్షియల్ మినిస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







