పాక్లో ఆకస్మికంగా పర్యటించనున్న తొలి భారత ప్రధాని కూడా మోదీనే!
- December 25, 2015
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అకస్మాత్తుగా పాకిస్థాన్లో పర్యటించనున్న సందర్భంగా లాహోర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా లాహోర్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల భారీగా భద్రతా దళాలను మోహరించారు. పోలీసులతోపాటు పాకిస్థాన్ రేంజర్లు కూడా లాహోర్ చేరుకుని భద్రతని పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని లాహోర్లో ఈ సాయంత్రం రెండు గంటల పాటు ఉంటారని ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆఫ్ఘనిస్థాన్ పర్యటనలో ఉన్న మోదీ అక్కడి నుంచి నేరుగా లాహోర్ చేరుకోనున్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి... ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని అయ్యాక మోదీ పాక్లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. పాక్లో ఆకస్మికంగా పర్యటించనున్న తొలి భారత ప్రధాని కూడా మోదీనే.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







