ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి, నలుగురికి గాయాలు
- January 12, 2019యూ.ఏ.ఈ:రోడ్డు మీద వెళుతున్న వాహనం ప్రమాదానికి గురవగా, మంటలు వ్యాపించి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఎమిరేట్స్ రోడ్డుపై మధ్యాహ్నం 1.45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి చెందిన అధికారులు ప్రమాదానికి గురయ్యారు. కాంక్రీట్ బ్యారియర్ని అతి వేగంతో కారు ఢీకొంది. ఆ తర్వాత కారు బోల్తా కొట్టింది. మంటలు వ్యాపించగా, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మిగతావారిని ఆసుపత్రికి తరలించారు. అల్ కాసిమి హాస్పిటల్లో వీరికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. వాహనదారులు రోడ్లపై అప్రమత్తంగా వుండాలనీ, అతి వేగం ప్రమాదాలకు ముఖ్య కారణమని షార్జా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఖాలిద్ మొహమ్మద్ అల్కే చెప్పారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!