ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి, నలుగురికి గాయాలు
- January 12, 2019
యూ.ఏ.ఈ:రోడ్డు మీద వెళుతున్న వాహనం ప్రమాదానికి గురవగా, మంటలు వ్యాపించి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఎమిరేట్స్ రోడ్డుపై మధ్యాహ్నం 1.45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి చెందిన అధికారులు ప్రమాదానికి గురయ్యారు. కాంక్రీట్ బ్యారియర్ని అతి వేగంతో కారు ఢీకొంది. ఆ తర్వాత కారు బోల్తా కొట్టింది. మంటలు వ్యాపించగా, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మిగతావారిని ఆసుపత్రికి తరలించారు. అల్ కాసిమి హాస్పిటల్లో వీరికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. వాహనదారులు రోడ్లపై అప్రమత్తంగా వుండాలనీ, అతి వేగం ప్రమాదాలకు ముఖ్య కారణమని షార్జా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఖాలిద్ మొహమ్మద్ అల్కే చెప్పారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







