కొత్త విమానాల్ని ప్రకటించిన ఇండియన్ ఎయిర్లైన్
- January 12, 2019మస్కట్: ఇండియాకి చెందిన బడ్జెట్ ఎయిర్లైన్ గో ఎయిర్, వారంలో ఏడు విమానాలు నడిపే దిశగా కొత్త ప్రకటనను విడుదల చేసింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేరళలోని కన్నుర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ విమానాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయని ఒమన్ - పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఏ) పేర్కొంది. గో ఎయిర్ ఆపరేషన్కి సంబంధించి అనుమతులు మంజూరు చేసినట్లు పిఎసిఎ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేసింది. లో కాస్ట్ ఇంటర్నేషనల్ కెరియర్ అయిన గో ఎయిర్, ముంబై కేంద్రంగా కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఇండియాలో ఐదో అతి పెద్ద ఎయిర్లైన్గా 2017లో గో ఎయిర్ గుర్తింపు తెచ్చుకుంది. ఇంకో వైపు కేరళలో ఐదవ అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్నుర్ పేరుగాంచింది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు