దుబాయ్:ఎన్టీఆర్ 23వ వర్థంతి సంధర్భంగా తెలుగు ప్రవాసీయులు ఘన నివాళి
- January 18, 2019
దుబాయ్:యూఏఈ లోని తెలుగు ప్రవాసీయులు ఎన్టీఆర్ వర్థంతి సంధర్భంగా అయన చేసిన ఘనతను స్మరించుకుంటూ ఓ తెలుగు బిడ్డ నిన్ను మరవదు ఈ తెలుగు గడ్డ బిడ్డలు అని గుర్తుచేసుకున్నారు. తెలుగుప్రజలేకాకుండా తమిళప్రజలు , కన్నడ ప్రజలు కూడా వర్థంతి జరుగుతున్న ప్రదేశాన్ని తెలుసుకుని స్వచ్చందంగా పాల్గొన్నారు . అయన చేసిన సేవలను తరతరాలకు గుర్తుండి పోయేలా ఉన్నాయని స్మరించుకున్నారు , దేశవిదేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నతి స్తానం దొరకడం కేవలం ఎన్టీఆర్ ఆనాడు చేసిన ఎన్నో పనులేనని తెలుగు ప్రజలు స్మరించుకున్నారు.
ఇప్పటికీ, రేపటికి, భవిష్యత్కి రైతుల కోసం ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. హెచ్పీకి రూ.50 తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని, 2 రూపాయల బియ్యానికి శ్రీకారం చుట్టింది కూడా ఎన్టీఆరే అని ప్రవాసీయులు కొనియాడారు. పరిపాలన అంటే ఏవిధంగా ఉండాలో ఎన్టీఆర్ చూపించారన్నారు. అధికారం కోసం ఆయన పార్టీ పెట్టలేదని, డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని పాల్గొన్న వక్తలు వ్యాఖ్యానించారు.




తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







