సింగపూర్ టైటిల్ విజేత అంకిత రైనా
- January 21, 2019భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా 2019 సీజన్లో తన తొలి సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. ఓవరా ల్గా అంకితకిది ఎనిమిదో టైటిల్. ఆదివారం జరిగిన సింగపూర్ ఈవెంట్ ఫైనల్లో డచ్ క్రీడాకారిణి వర ల్డ్ నెంబర్ 122 అ ³రంటగ్జా రస్ను 6-3, 6-2 తేడాతో ఓడించింది. గంటా 23 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో అంకిత పోరాడి గెలి చింది. ఆస్ట్రేలియన్ ఒపెన్ క్వాలిఫయర్ పోటీల్లో పాల్గొంటూ అంకిత రెండో రౌండ్లో ఓటమిపాలైనప్పటికి.. అనంతరం 25,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్మనీ ఉన్న ఐటీఎఫ్ సింగపూర్ ఈవెంట్లో పాల్గొంటూ నలుగురు సీడెడ్ క్రీడాకారి ణులను ఓడించింది. రెండో రౌండ్లో నెదర్లాండ్స్కు చెందిన ఎనిమిదో సీడెడ్ క్రీడాకారిణి లెస్లీ కెర్కొవాను ఓడించింది. అనంతరం రెండో సీడెడ్ ఉజ్బెక్ క్రీడాకారిణి సబీనా షరిపో వాను, మూడో సీడెడ్ స్విట్జర్లాండ్కు చెందిన కాని పెరిన్ను పరాజయం పాలుచేసింది. ఈ టోర్నీ టైటిల్ గెలుపుతో అంకిత డబ్ల్యుటీఏ 50 పాయింట్లను గెలుపొంది సోమవారం విడుదల య్యే తాజా ర్యాంకింగ్స్లో తన కెరియర్ బెస్ట్ 168వ స్థానాన్ని అందు కునే అవకాశాలున్నాయి. మ్యాచ్ అనంతరం అంకిత మాట్లా డు తూ.. నేను సర్వీసులను మెరు గుపర్చుకునేందుకు కృషి చేస్తు న్నాను.
ఇప్పుడు ఫలితం కన్పిస్తోంది. నా షాట్లలో మరిం త శక్తివంతంగా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారం భంలో గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడటం నాకు కలసివ చ్చింది. ఈ ఆటతో నాలో మరింత ఆత్మవి శ్వాసం పెరిగిందని తెలిపిం ది.
ఒకప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్కు అర్హత సాధించలేదన్న బాధ నన్ను నిరాశ పర్చింది. కాని సింగపూర్ టైటిల్ను గెలుపొం దడం నాకు సంతోషాన్ని చ్చిందని అంకిత పేర్కొంది. 25వేల డాలర్ల విలువైన టైటిళ్లలో అంకితకు ఇది నాలుగో టైటిల్. మిగతా నాలుగు టైటిల్స్ 10వేల డాలర్ల విలువైనవి.
ఆసియా క్రీడల్లో అంకిత కాంస్యాన్ని సాధిం చింది. ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభమయ్యే ఫెడరేషన్ కప్లో పాల్గొనడానికి ముందు అంకిత మరో రెండు టోర్నీల్లో పాల్గొనాల్సి ఉంది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక