తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని చంపి.. ముక్కలుగా కోసి వాటిని..
- January 24, 2019
తీసుకున్న డబ్బులో కొంత చెల్లించేసాడు. మిగిలిన డబ్బు నిదానంగా చెల్లిస్తానన్నాడు. దాంతో కోపం కట్టలు తెంచుకుంది. అందే బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ముంబైలోని శాంటాక్రూజ్లో జరిగింది. పింటూ శర్మ, గణేష్ కొల్హాద్కర్ ఇద్దరూ స్నేహితులు. గణేష్ వ్యక్తిగత అవసరాల రిత్యా పింటూ దగ్గర లక్షరూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
కొద్ది రోజుల తరువాత 40 వేలు అప్పు కింద జమ కట్టుకోమని ఇచ్చాడు. మిగిలిన 60 వేల బాకీని త్వరలో తీర్చేస్తానన్నాడు. ఎన్ని రోజులైనా మిగిలిన అప్పు మాట ఎత్తట్లేదు. తనకీ ఖర్చులు ఉన్నాయని చెప్పినా తీర్చేస్తానంటున్నాడే కాని నయా పైసా చెల్లించలేదు. దాంతో గణేష్ పట్ల కోపంగా ఉన్నాడు పింటూ.
ఇదిలా ఉండగా ఓ రోజు కలిసి మద్యం తాగుదాం అని పింటూ గణేష్ని పిలిచాడు. ఇద్దరూ పీకలదాకా మద్యం సేవించారు. ఆ మత్తులోనే అప్పు గురించి ఎత్తాడు పింటూ. దాని గురించి గొడవకు కూడా దిగారు ఇద్దరూ. ఈ క్రమంలోనే గణేష్ని పింటూ మేడపై నుంచి కిందికి తోసేసాడు. రెండో అంతస్తు నుంచి కింద పడ్డ గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బాడీని తీసుకుని బాత్రూంలోకి వెళ్లి 200 ముక్కలుగా నరికాడు.
వాటిని టాయ్లెట్లో పడేసి నాలుగు రోజుల పాటు అందులో నీళ్లు పోస్తూనే ఉన్నాడు. మున్సిపల్ కార్మికులు డ్రైనేజీ శుభ్రపరుస్తుండగా మృతదేహం ముక్కలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు పింటూను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







