వరుస బాంబు పేలుళ్లు..నలుగురు పోలీసులు మృతి
- January 27, 2019
సమర్రా: ఇరాక్ లోని అల్ షర్కత్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో నలుగురు ఇరాక్ పోలీసులు మృతి చెందారు. ఉదయం 8 గంటలకు అల్ షర్కత్ జిల్లా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఓ బాంబు పేలింది. ఈ పేలుడులో ఇద్దరు పోలీస్ అధికారులు మృతి చెందగా..మరో 8 మంది పోలీసులు గాయపడ్డారు. గంట వ్యవధిలోనే రెండోసారి బాంబు పేలింది. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు చనిపోగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయని పట్టణ మేయర్ అలీ దోఢా తెలిపారు.
బాగ్దాద్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ షర్కత్ 2017వరకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆధీనంలో ఉండేది. అయితే ఇరాక్ ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటినుంచి ఐఎస్ ఉగ్రవాదులు విధ్వంసాన్ని సృష్టించడం, అధికారులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..









