వరుస బాంబు పేలుళ్లు..నలుగురు పోలీసులు మృతి
- January 27, 2019
సమర్రా: ఇరాక్ లోని అల్ షర్కత్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో నలుగురు ఇరాక్ పోలీసులు మృతి చెందారు. ఉదయం 8 గంటలకు అల్ షర్కత్ జిల్లా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఓ బాంబు పేలింది. ఈ పేలుడులో ఇద్దరు పోలీస్ అధికారులు మృతి చెందగా..మరో 8 మంది పోలీసులు గాయపడ్డారు. గంట వ్యవధిలోనే రెండోసారి బాంబు పేలింది. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు చనిపోగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయని పట్టణ మేయర్ అలీ దోఢా తెలిపారు.
బాగ్దాద్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ షర్కత్ 2017వరకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆధీనంలో ఉండేది. అయితే ఇరాక్ ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటినుంచి ఐఎస్ ఉగ్రవాదులు విధ్వంసాన్ని సృష్టించడం, అధికారులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







