వరుస బాంబు పేలుళ్లు..నలుగురు పోలీసులు మృతి
- January 27, 2019
సమర్రా: ఇరాక్ లోని అల్ షర్కత్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో నలుగురు ఇరాక్ పోలీసులు మృతి చెందారు. ఉదయం 8 గంటలకు అల్ షర్కత్ జిల్లా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఓ బాంబు పేలింది. ఈ పేలుడులో ఇద్దరు పోలీస్ అధికారులు మృతి చెందగా..మరో 8 మంది పోలీసులు గాయపడ్డారు. గంట వ్యవధిలోనే రెండోసారి బాంబు పేలింది. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు చనిపోగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయని పట్టణ మేయర్ అలీ దోఢా తెలిపారు.
బాగ్దాద్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ షర్కత్ 2017వరకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆధీనంలో ఉండేది. అయితే ఇరాక్ ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటినుంచి ఐఎస్ ఉగ్రవాదులు విధ్వంసాన్ని సృష్టించడం, అధికారులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









