శింబు బ్రేకప్ అయినప్పుడు కూడా ఏడ్వలేదు:మహత్
- January 27, 2019
చెన్నై: కోలీవుడ్లో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన ప్రస్తుతం 'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ 'వంత రాజవంతాన్ వరువెన్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో మేఘా ఆకాశ్, కేథరిన్ కథానాయికల పాత్రలు పోషించారు. నదియా పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఫిబ్రవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మణిరత్నం తెరకెక్కించిన 'చెక్క సీవంత వానం' (తెలుగులో 'నవాబ్') సినిమాలోని డైలాగ్ స్ఫూర్తితో ఈ సినిమా టైటిల్ను ఖరారు చేశారు.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు మహత్ మీడియాతో మాట్లాడారు. తన మిత్రుడు శింబు గురించి చెప్పారు. ఆయన ఎప్పుడూ ఏడ్వలేదని, కేవలం ఒక్కసారి చాలా కుమిలిపోయారని అన్నారు. 'ప్రేమలో విఫలమైనప్పుడు బాధను వ్యక్తపరుస్తూ ఏడుస్తారు. కానీ శింబు బ్రేకప్ అయినప్పుడు కూడా ఏడ్వలేదు. కానీ కావేరీ జలాల వివాద సమయంలో శింబు ఓ వీడియోను విడుదల చేశారు. అప్పుడు ఆయన్ను విమర్శిస్తూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో శింబు చాలా ఏడ్చారు. వీడియోలోని ప్రతి మాట ఆయన హృదయం నుంచి వచ్చింది. కానీ ప్రజలు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో శింబు ఎంతో బాధపడ్డారు. ఏదేమైనప్పటికీ కర్ణాటక కావేరీ జలాలను వదిలింది. కాబట్టి శింబు ప్రయత్నం విజయవంతమైందనే చెప్పొచ్చు' అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







