శింబు బ్రేకప్ అయినప్పుడు కూడా ఏడ్వలేదు:మహత్
- January 27, 2019
చెన్నై: కోలీవుడ్లో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన ప్రస్తుతం 'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ 'వంత రాజవంతాన్ వరువెన్' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో మేఘా ఆకాశ్, కేథరిన్ కథానాయికల పాత్రలు పోషించారు. నదియా పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఫిబ్రవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మణిరత్నం తెరకెక్కించిన 'చెక్క సీవంత వానం' (తెలుగులో 'నవాబ్') సినిమాలోని డైలాగ్ స్ఫూర్తితో ఈ సినిమా టైటిల్ను ఖరారు చేశారు.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు మహత్ మీడియాతో మాట్లాడారు. తన మిత్రుడు శింబు గురించి చెప్పారు. ఆయన ఎప్పుడూ ఏడ్వలేదని, కేవలం ఒక్కసారి చాలా కుమిలిపోయారని అన్నారు. 'ప్రేమలో విఫలమైనప్పుడు బాధను వ్యక్తపరుస్తూ ఏడుస్తారు. కానీ శింబు బ్రేకప్ అయినప్పుడు కూడా ఏడ్వలేదు. కానీ కావేరీ జలాల వివాద సమయంలో శింబు ఓ వీడియోను విడుదల చేశారు. అప్పుడు ఆయన్ను విమర్శిస్తూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో శింబు చాలా ఏడ్చారు. వీడియోలోని ప్రతి మాట ఆయన హృదయం నుంచి వచ్చింది. కానీ ప్రజలు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో శింబు ఎంతో బాధపడ్డారు. ఏదేమైనప్పటికీ కర్ణాటక కావేరీ జలాలను వదిలింది. కాబట్టి శింబు ప్రయత్నం విజయవంతమైందనే చెప్పొచ్చు' అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!
- కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!









