హైదరాబాద్లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం
- January 29, 2019
హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తాజాగా మరో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.
హైదరాబాద్లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. వాతావరణం చల్లబడడంతో ఈ మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నాలుగు స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. శామీర్పేట్ నల్సార్ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులకు ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 9కి చేరింది. నల్సార్ విద్యార్థులకు ముందే మరో ఐదుగురిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేసుకోవాలన్నారు.
చిన్న జాగ్రత్తలు తీసుకుంటే స్వైన్ ఫ్లూ బారి నుంచి కాపాడుకోవచ్చు. సాధారణ ఫ్లూ, స్వైన్ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. అయితే జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. స్వైన్ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వెళ్లగానే చేతులు, కాళ్లు సబ్బుతో కడుక్కోవాలి. మూడు కన్నా ఎక్కువ రోజులు పై లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







