త్వరలో 4 కొత్త ట్రాఫిక్ జరీమానాలు
- January 30, 2019
యూఏఈ: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే మోటరిస్టులకి తాజా హెచ్చరిక ఏంటంటే, కొత్తగా మరికొన్ని ట్రాఫిక్ జరీమానాలు విధించే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు అథికారులు. పాదచారులకు మెరుగైన భద్రత కల్పించే దిశగా ఈ చర్యలు చేపడుతున్నారు. పెడెస్ట్రియన్ క్రాసింగ్ మీద వాహనాన్ని నిలిపితే 500 దిర్హామ్లు జరీమానా విధిస్తారు. రోడ్డు దాటుతున్న పాదచారులకు ఇబ్బంది కలిగేలా వాహనాలతో వ్యవహరిస్తే 400 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. పేవ్మెంట్ మీద పార్క్ చేసే వెహికిల్స్కి విధించే 400 దిర్హామ్లు మూడో అంశం. జరీమానాలతోపాటు 4 బ్లాక్ పాయింట్స్ కూడా తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకో వైపు అబుదాబీ కొత్త ట్రాఫిక్ వార్నింగ్ రాడార్స్ని అమల్లోకి తీసుకురానుంది. స్కూల్స్ వుండే ప్రాంతాలు, అలాగే పాదచారుల క్రాసింగ్స్ వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించి, జరీమానాలు విధిస్తాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







