జయరాం మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది..
- February 02, 2019పారిశ్రామిక వేత్త జయరాం మర్డర్ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. జయరాం మర్డర్ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దాడి చేసిన తరువాత శిఖా చౌదరి బాయ్ ఫ్రెండ్ అజ్ఞాతంలోకి వెళ్లాడని.. జయరాం మర్డర్ తరువాత నుంచి శిఖా బాయ్ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
జయరాం తలమీద బలంగా దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు వీరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జయరాంపై దాడి చేసిన తరువాత హడావుడిలో అక్కడి నుంచి నిందితులు ఎస్కేప్ అయ్యారు.తనపై దాడి జరగవచ్చని ముందుగానే గుర్తించిన జయరాం…ఆర్థిక లావాదేవిలు తన మెడకు చుట్టుకోవచ్చని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.
జయరాంతో పాటు ఆ రోజంతా ఎవరెవరు ఉన్నారనే కోణంలో సెల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ఓ గెస్ట్ హౌజ్లో శిఖా చౌదరితో పాటు మరో మహిళను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు ప్రధాన కారణం ఆర్థిక లావాదేవిలే అని పోలీసులు నిర్ధారణకొచ్చారు. అమెరికా నుంచి రేపు ఉదయం హైదరాబాద్కు జయరాం కుటుంబ సభ్యులు రానున్నారు.
తాజా వార్తలు
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..