ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి
- February 07, 2019
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. సమాచార ఉపగ్రహాల ప్రయోగంలో ఆరి తేరిన ఇస్రో, తాజాగా మరో సమాచార ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్గా అంతరిక్షంలోకి పంపించింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంత రిక్ష పరిశోధనా కేంద్రం నుంచి కమ్యూనికేషన్ శాటిలైట్ జిశాట్-31ను ప్రయోగించారు. ఏరియానా స్పేస్ రాకెట్, జి శాట్-31ను 42 నిమిషాల్లోనే కక్ష్యలోకి చేర్చింది.
భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 2 గంటల 31 నిమిషాలకు జీశాట్ -31 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. జీశాట్ -31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ -4ను కూడా రోదసీలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.
జిశాట్ బరువు 2,535 కిలోలు. ఇందులో అత్యంత సమర్థమంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్థ ఉంది. ఈ సమా చార ఉపగ్రహం 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలందించనుంది. భారతీయ భూభాగాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఇప్పటికే భూస్థిర కక్ష్యలో ఉన్న ఇతర కమ్యూ నికేషన్ శాటిలైట్లతో కలసి జిశాట్-31 పని చేయనుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..