అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్ధులకు విముక్తి
- February 13, 2019
అమెరికాలో నకిలీ వీసాల కేసులో…. అరెస్టైన తెలుగు విద్యార్ధుల విముక్తి లబిస్తోంది. కోర్టు విచారణ తర్వాత ఒక్కొక్కరుగా స్వదేశం తిరిగి వచ్చేందుకు వీలు కలుగుతోంది. డౌన్టౌన్ డెట్రాయిట్ కోర్టులో విచారణ జరిగింది. అక్కడి జైళ్లలో ఉన్న 20 మందిలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులకు విముక్తి లభించింది. మిగిలిన 17 మందిలో 15 మంది ఫిబ్రవరి 26 లోపు అమెరికా నుంచి ఇండియా వెళ్లిపోయేందుకు కోర్టు అనుమతిచ్చింది. కోర్టు నుంచి తుది ఆదేశాలు రాగానే… వారంతా ఇండియాకు రానున్నారు. ఇవాళ కోర్టు హాజరైనా ఈ 17 మంది విద్యార్ధుల్లో 8 మంది మిన్రో డిటెన్షన్ సెంటర్లో ఉన్నారు. మరో 9 మంది కల్హౌన్ కౌంటిలో 9 మంది విద్యార్ధులున్నారు. మొత్తం ఈ 17 మందిలో 15 మందికి విముక్తి లభించినట్లైంది॥ ఏడుగురు స్వచ్చంద నిష్క్రమణకు అంగీకరించారు. మరో విద్యార్ధు బహిష్కరించారు. మరో విద్యార్ధి కేసు విచారణ జరుగుతోంది. అయితే..అతని స్వచ్ఛంద నిష్కమణించే అవకాశం ఉంది.
మిషిగాన్ డిటెన్షన్ సెంటర్లో ముగ్గురు విద్యార్ధులు విడుదలయ్యారని అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇవాళ మరో 18 మం దికి బెయిల్ దొరికే అవకాశం ఉంది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ బృందం అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఎలిసా స్లాట్ను కలిసింది. విచారణను వేగవంతం చేసి విద్యార్థులకు విముక్తి లభించేలా చూడాలని కోరింది. దీంతో ఎలిసా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సంప్రదింపులు జరిపి విద్యార్థుల విముక్తికి కృషిచేశారు. విద్యార్థుల విడుదలకు అటార్నీ రాండీ సమోన కృషిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







