అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్ధులకు విముక్తి

- February 13, 2019 , by Maagulf
అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్ధులకు విముక్తి

అమెరికాలో నకిలీ వీసాల కేసులో…. అరెస్టైన తెలుగు విద్యార్ధుల విముక్తి లబిస్తోంది. కోర్టు విచారణ తర్వాత ఒక్కొక్కరుగా స్వదేశం తిరిగి వచ్చేందుకు వీలు కలుగుతోంది. డౌన్టౌన్‌ డెట్రాయిట్‌ కోర్టులో విచారణ జరిగింది. అక్కడి జైళ్లలో ఉన్న 20 మందిలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులకు విముక్తి లభించింది. మిగిలిన 17 మందిలో 15 మంది ఫిబ్రవరి 26 లోపు అమెరికా నుంచి ఇండియా వెళ్లిపోయేందుకు కోర్టు అనుమతిచ్చింది. కోర్టు నుంచి తుది ఆదేశాలు రాగానే… వారంతా ఇండియాకు రానున్నారు. ఇవాళ కోర్టు హాజరైనా ఈ 17 మంది విద్యార్ధుల్లో 8 మంది మిన్రో డిటెన్షన్‌ సెంటర్‌లో ఉన్నారు. మరో 9 మంది కల్హౌన్‌ కౌంటిలో 9 మంది విద్యార్ధులున్నారు. మొత్తం ఈ 17 మందిలో 15 మందికి విముక్తి లభించినట్లైంది॥ ఏడుగురు స్వచ్చంద నిష్క్రమణకు అంగీకరించారు. మరో విద్యార్ధు బహిష్కరించారు. మరో విద్యార్ధి కేసు విచారణ జరుగుతోంది. అయితే..అతని స్వచ్ఛంద నిష్కమణించే అవకాశం ఉంది.

మిషిగాన్ డిటెన్షన్ సెంటర్లో ముగ్గురు విద్యార్ధులు విడుదలయ్యారని అమెరికన్‌ తెలుగు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇవాళ మరో 18 మం దికి బెయిల్ దొరికే అవకాశం ఉంది. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ బృందం అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఎలిసా స్లాట్‌ను కలిసింది. విచారణను వేగవంతం చేసి విద్యార్థులకు విముక్తి లభించేలా చూడాలని కోరింది. దీంతో ఎలిసా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో సంప్రదింపులు జరిపి విద్యార్థుల విముక్తికి కృషిచేశారు. విద్యార్థుల విడుదలకు అటార్నీ రాండీ సమోన కృషిచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com