పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన అమెరికా
- February 15, 2019
జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిని అమెరికా సహా ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ఖండించాయి. ముష్కరుల విషయంలో పాక్ తీరు మారాల్సిందేనంటూ US హెచ్చరించింది. పాక్… ఉగ్రవాదులకు మద్దతివ్వడం.. వారిని కాపాడేందుకు ప్రయత్నించడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని పాక్కు వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందంటూ అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రపంచ దేశాల్లో గందరగోళాన్ని, హింసను వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యమని US మండి పడింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో అమెరికా భారత్కు పూర్తి మద్దతిస్తుందని ప్రకటించింది. రెండు దేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తాయని పేర్కొంది. ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా… ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్, జర్మనీలు ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







