పాకిస్తాన్ హై కమిషనర్‌కు సమన్లు..

- February 15, 2019 , by Maagulf
పాకిస్తాన్ హై కమిషనర్‌కు సమన్లు..

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది... దీంతో పాకిస్థాన్ హై కమిషనర్‌ సోహేల్ మహమూద్‌కు సమన్లు జారీచేసినట్టు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాక్ రాయబారికి సమన్లు జారీ చేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మాద్‌పై పాకిస్థాన్ తక్షణమే కఠినమైన నిర్ణయం తీసుకోవాలని పాకిస్థాన్ రాయబారిని ఆదేశించింది భారత విదేశాంగశాఖ. పాకిస్థాన్‌ నుంచి సాగుతోన్న అన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇక పుల్వామా దాడిపై పాక్ విదేశాంగ శాఖ ప్రకటనను కూడా భారత విదేశాంగ శాఖ ఖండించింది. కాగా, పుల్వామా ఘటనలో మృతిచెందిన జవాన్ల సంఖ్య 49కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com