వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు
- February 16, 2019
ప్రతిష్టాత్మకమైన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. అత్యంత వేగంగా వెళ్లే ఈ రైలు రెండవ రోజే సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఈ ఉదయం వారణాసి నుంచి ఢిల్లీకి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ తుండ్లా స్టేషన్ వద్ద ఆగిపోయింది. ఓ ఆవును ఢీకొనడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. తుండ్లా స్టేషన్ వద్ద సుమారు 3 గంటల పాటు రైలును ఆపేశారు.
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న సమయంలో ఆ రైలు గంటకు 130 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వేగంతో వెళ్లింది. అయితే ఇవాళ సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఆ రైలును కేవలం 40 కిలోమీటర్ల వేగంతో తీసుకువెళ్లారు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో అది నిలిచిపోయింది. నిన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఢిల్లీలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రైలు ప్రారంభించిన మరుసటి రోజే సాంకేతిక సమస్యలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







