వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు
- February 16, 2019ప్రతిష్టాత్మకమైన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. అత్యంత వేగంగా వెళ్లే ఈ రైలు రెండవ రోజే సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఈ ఉదయం వారణాసి నుంచి ఢిల్లీకి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ తుండ్లా స్టేషన్ వద్ద ఆగిపోయింది. ఓ ఆవును ఢీకొనడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. తుండ్లా స్టేషన్ వద్ద సుమారు 3 గంటల పాటు రైలును ఆపేశారు.
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న సమయంలో ఆ రైలు గంటకు 130 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వేగంతో వెళ్లింది. అయితే ఇవాళ సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఆ రైలును కేవలం 40 కిలోమీటర్ల వేగంతో తీసుకువెళ్లారు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో అది నిలిచిపోయింది. నిన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఢిల్లీలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రైలు ప్రారంభించిన మరుసటి రోజే సాంకేతిక సమస్యలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!