వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు
- February 16, 2019
ప్రతిష్టాత్మకమైన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. అత్యంత వేగంగా వెళ్లే ఈ రైలు రెండవ రోజే సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఈ ఉదయం వారణాసి నుంచి ఢిల్లీకి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ తుండ్లా స్టేషన్ వద్ద ఆగిపోయింది. ఓ ఆవును ఢీకొనడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. తుండ్లా స్టేషన్ వద్ద సుమారు 3 గంటల పాటు రైలును ఆపేశారు.
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న సమయంలో ఆ రైలు గంటకు 130 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వేగంతో వెళ్లింది. అయితే ఇవాళ సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఆ రైలును కేవలం 40 కిలోమీటర్ల వేగంతో తీసుకువెళ్లారు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో అది నిలిచిపోయింది. నిన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఢిల్లీలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రైలు ప్రారంభించిన మరుసటి రోజే సాంకేతిక సమస్యలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







