వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు
- February 16, 2019
ప్రతిష్టాత్మకమైన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆదిలోనే ఇబ్బందులు తలెత్తాయి. అత్యంత వేగంగా వెళ్లే ఈ రైలు రెండవ రోజే సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఈ ఉదయం వారణాసి నుంచి ఢిల్లీకి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ తుండ్లా స్టేషన్ వద్ద ఆగిపోయింది. ఓ ఆవును ఢీకొనడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. తుండ్లా స్టేషన్ వద్ద సుమారు 3 గంటల పాటు రైలును ఆపేశారు.
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న సమయంలో ఆ రైలు గంటకు 130 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వేగంతో వెళ్లింది. అయితే ఇవాళ సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఆ రైలును కేవలం 40 కిలోమీటర్ల వేగంతో తీసుకువెళ్లారు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో అది నిలిచిపోయింది. నిన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఢిల్లీలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రైలు ప్రారంభించిన మరుసటి రోజే సాంకేతిక సమస్యలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..