అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి!
- February 16, 2019
షికాగో: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరవకముందే చోటుచేసుకుంటున్న మరో ఘటన అమెరికన్స్తో పాటు అక్కడకు వలస వెళ్లిన విదేశీయులను వణికిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఇలినాయిస్ రాష్ట్రంలోని షికాగకు 80 కిమీ దూరంలో వున్న ఆరోరా నగరంలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్లో ఓ దుండగుడు హ్యాండ్ గన్తో జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా పలువురు గాయపడ్డారని ఆరోరా పోలీస్ చీఫ్ క్రిస్టెన్ జిమాన్ తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. అంతకన్నా ముందుగా పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు దుండగుడు వారిపైకి కాల్పులు జరపగా ఈ కాల్పుల్లో మరో ఐదుగురు పోలీసులు గాయపడినట్టు తెలుస్తోంది. పోలీసుల కాల్పుల్లో గాయపడిన దుండగుడిని గ్యారీ మార్టిన్గా గుర్తించారు.
హెన్రీ ప్రాట్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకోగా... అదే కంపెనీలో పని చేసే ఉద్యోగి గ్యారీ మార్ట్ సహోద్యోగులపైనే తుపాకీతో దాడికి పాల్పడినట్టు సమాచారం.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







