అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి!
- February 16, 2019
షికాగో: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరవకముందే చోటుచేసుకుంటున్న మరో ఘటన అమెరికన్స్తో పాటు అక్కడకు వలస వెళ్లిన విదేశీయులను వణికిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఇలినాయిస్ రాష్ట్రంలోని షికాగకు 80 కిమీ దూరంలో వున్న ఆరోరా నగరంలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్లో ఓ దుండగుడు హ్యాండ్ గన్తో జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా పలువురు గాయపడ్డారని ఆరోరా పోలీస్ చీఫ్ క్రిస్టెన్ జిమాన్ తెలిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. అంతకన్నా ముందుగా పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు దుండగుడు వారిపైకి కాల్పులు జరపగా ఈ కాల్పుల్లో మరో ఐదుగురు పోలీసులు గాయపడినట్టు తెలుస్తోంది. పోలీసుల కాల్పుల్లో గాయపడిన దుండగుడిని గ్యారీ మార్టిన్గా గుర్తించారు.
హెన్రీ ప్రాట్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకోగా... అదే కంపెనీలో పని చేసే ఉద్యోగి గ్యారీ మార్ట్ సహోద్యోగులపైనే తుపాకీతో దాడికి పాల్పడినట్టు సమాచారం.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!