ఏపీ సీఎం మైక్రోసాఫ్ట్ సీఈవోతో సమావేశం

- December 27, 2015 , by Maagulf
ఏపీ సీఎం మైక్రోసాఫ్ట్ సీఈవోతో సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ సీఈవోతో సోమవారం సమావేశం అయ్యారు. సోమవారం ఉదయం 8గంటలకు హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ సీఈవోతో బాబు భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది.విద్య, వ్యవసాయం, పౌర సేవా విభాగాల్లో..మెరుగైన అభివృద్ధి సాధించేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్‌ రూపొందించిన అజూర్‌ ల్యాబ్‌ విధానాన్ని..వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సోమవారం ఉదయం10.30 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు చంద్రబాబు వెళతారు. ఉదయం10.30 నుంచి జపాన్‌ టొయోమో గవర్నర్‌ బృందంతో భేటీ అవుతారు. ఏపీ-జపాన్‌ మధ్య పలు ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి టొయోమో గవర్నర్‌ బృందానికి లంచ్‌ ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com