స్మగ్లింగ్ - ఒమన్లో 10 మంది అరెస్ట్
- February 21, 2019
మస్కట్: పది మంది వలసదారులు స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. డీజిల్, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని స్మగుల్ చేస్తున్నట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ముసాందామ్ మరియు సలాలాలోని తీర ప్రాంతాల్లో నిందితులు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దోఫార్ కోస్ట్ గార్డ్ పెట్రోల్స్, పోర్ట్ ఆఫ్ సలాలా దగ్గరలో ఫిషింగ్ బోట్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారనీ, వారి నుంచి కొంత మొత్తంలో ఖత్ని స్వాధీనం చేసుకున్నారనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితుల వద్ద 2200 ప్యాకెట్ల ఖత్ లభ్యమయ్యింది. ముసాందామ్ గవర్నరేట్లో కోస్ట్ గార్డ్ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. వీరంతా ఆసియా జాతీయులే. డీజిల్ని బోట్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మరో కేసులో కోస్ట్గార్డ్ పెట్రోల్ - కుమ్జార్, ముగ్గురు వ్యక్తుల్ని తీసుకెళుతున్న బోట్ని సీజ్ చేశారు. అందులో వున్న ముగ్గురు వ్యక్తులు ఆసియాకి చెందినవారే.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







