స్మగ్లింగ్ - ఒమన్లో 10 మంది అరెస్ట్
- February 21, 2019మస్కట్: పది మంది వలసదారులు స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. డీజిల్, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని స్మగుల్ చేస్తున్నట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ముసాందామ్ మరియు సలాలాలోని తీర ప్రాంతాల్లో నిందితులు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దోఫార్ కోస్ట్ గార్డ్ పెట్రోల్స్, పోర్ట్ ఆఫ్ సలాలా దగ్గరలో ఫిషింగ్ బోట్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారనీ, వారి నుంచి కొంత మొత్తంలో ఖత్ని స్వాధీనం చేసుకున్నారనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితుల వద్ద 2200 ప్యాకెట్ల ఖత్ లభ్యమయ్యింది. ముసాందామ్ గవర్నరేట్లో కోస్ట్ గార్డ్ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. వీరంతా ఆసియా జాతీయులే. డీజిల్ని బోట్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మరో కేసులో కోస్ట్గార్డ్ పెట్రోల్ - కుమ్జార్, ముగ్గురు వ్యక్తుల్ని తీసుకెళుతున్న బోట్ని సీజ్ చేశారు. అందులో వున్న ముగ్గురు వ్యక్తులు ఆసియాకి చెందినవారే.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!