పాక్ తో యుద్ధంపై నేడే కాబినెట్ భేటీ
- February 28, 2019
పాక్ కు బుద్ధిచెప్పందుకు భారత్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒకవైపు ఉగ్రమూకల ఏరివేతలో సహకరించగపోగా.. యాన్టీ టెర్రరిస్ట్ అపరేషన్ చేస్తున్న భారత్ ప్రయత్నాలను పాక్ అడ్డుకుంటోంది. పుల్వామా దాడికి ప్రతికారంగా జైషే స్థావరాలను లక్ష్యం చేకొని భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భాగంలో ఇంటా.. బయట ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియను భారత్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రవేశించి ఉగ్రస్థావరాలను కూకటివేళ్లతో పీకేందుకు భారత సైన్యం చర్యలు తీసుకుంటోంది.
ఈ వ్యహారాన్ని అడ్డుపెట్టుకొని తమ భూభాగంపై భారత బలగాలు వచ్చాయని గగ్గోలుపెడుతున్న పాక్..తమ యుద్ధవిమానాలు భారత్ సరిహద్దుల్లో పంపించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించేందుకు ఈ రోజు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అవుతోంది. సాయంత్రం 6:40కి జరిగే ఈ భేటీలో ప్రధాని మోడీ తో పాటు కేబినెట్ మంత్రులంతా హాజరౌతారు. ఈ భేటీలో త్రివిధ దళాల అధిపతులు కూడా హాజరౌతున్నట్లు తెలిసింది.
సాయంత్రం జరిగే ఈ భేటీలో ఇండో పాక్ సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పాక్ ను అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. పాక్ కవ్వింపు చర్యలు రోజు రోజుకు మితిమీరుతున్న నేపథ్యంలో ఇక యుద్ధం చేయడమే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







