రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- March 02, 2019
యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ జాతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్ అల్ కువైన్లోని ఎతిహాద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తస్హీల్ సెంటర్ దగ్గరలో రోడ్డు దాటుతుండగా, వాహనం అతనిపైకి దూసుకెళ్ళిందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ - యూఏక్యూ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సయీద్ ఒబైద్ చెప్పారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్ ఘటనా స్థలికి చేరుకోవడం జరిగింది. తీవ్ర గాయాలతో వున్న బాధితుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. వాహనదారులు రోడ్డుపై అప్రమత్తంగా వ్యవహరించాలనీ, రోడ్డు దాటే క్రమంలో పాదచారులూ జాగ్రత్తగా వుండాలని కల్నల్ సయీద్ ఒబైద్ సూచించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







