రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- March 02, 2019
యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ జాతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్ అల్ కువైన్లోని ఎతిహాద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తస్హీల్ సెంటర్ దగ్గరలో రోడ్డు దాటుతుండగా, వాహనం అతనిపైకి దూసుకెళ్ళిందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ - యూఏక్యూ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సయీద్ ఒబైద్ చెప్పారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్ ఘటనా స్థలికి చేరుకోవడం జరిగింది. తీవ్ర గాయాలతో వున్న బాధితుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. వాహనదారులు రోడ్డుపై అప్రమత్తంగా వ్యవహరించాలనీ, రోడ్డు దాటే క్రమంలో పాదచారులూ జాగ్రత్తగా వుండాలని కల్నల్ సయీద్ ఒబైద్ సూచించారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







