రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- March 02, 2019
యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ జాతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్ అల్ కువైన్లోని ఎతిహాద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తస్హీల్ సెంటర్ దగ్గరలో రోడ్డు దాటుతుండగా, వాహనం అతనిపైకి దూసుకెళ్ళిందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ - యూఏక్యూ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సయీద్ ఒబైద్ చెప్పారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్ ఘటనా స్థలికి చేరుకోవడం జరిగింది. తీవ్ర గాయాలతో వున్న బాధితుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. వాహనదారులు రోడ్డుపై అప్రమత్తంగా వ్యవహరించాలనీ, రోడ్డు దాటే క్రమంలో పాదచారులూ జాగ్రత్తగా వుండాలని కల్నల్ సయీద్ ఒబైద్ సూచించారు.
తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









