పాక్ - భారత్ మధ్య మధ్యవర్తిత్వం లేదు
- March 02, 2019
అబుధాబి:పాకిస్తాన్, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో ఓఐసీ నుంచి ఎలాంటి మధ్యవర్తిత్వం లేదని భారత విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేననీ, ఈ విషయంలో ఇంకో మాటకు తావులేదని విదేశాంగ శాఖ కార్యదర్శుల్లో ఒకరైన టి.యస్ తిరుమూర్తి చెప్పారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ సమ్మిట్ సందర్భంగా అబుధాబిలో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు. కాగా, ఎంఇఎ అధికార ప్రతినిథి ఇండియా - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణంపై మాట్లాడేందుకు నిరాకరించారు. టి.యస్ తిరుమూర్తి మాట్లాడుతూ, ఈ శుక్రవారం చారిత్రాత్మకమైన రోజు అనీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, గెస్ట్ ఆఫ్ హానర్గా ఓఐసి సమావేశంలో ప్రసంగించడం గొప్ప విషయమని అన్నారు.ఈ ప్రెస్ మీట్ లో ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి,అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రవనీష్ కుమార్ పాల్గొన్నారు
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







