పాక్ - భారత్ మధ్య మధ్యవర్తిత్వం లేదు
- March 02, 2019
అబుధాబి:పాకిస్తాన్, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో ఓఐసీ నుంచి ఎలాంటి మధ్యవర్తిత్వం లేదని భారత విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేననీ, ఈ విషయంలో ఇంకో మాటకు తావులేదని విదేశాంగ శాఖ కార్యదర్శుల్లో ఒకరైన టి.యస్ తిరుమూర్తి చెప్పారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ సమ్మిట్ సందర్భంగా అబుధాబిలో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు. కాగా, ఎంఇఎ అధికార ప్రతినిథి ఇండియా - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణంపై మాట్లాడేందుకు నిరాకరించారు. టి.యస్ తిరుమూర్తి మాట్లాడుతూ, ఈ శుక్రవారం చారిత్రాత్మకమైన రోజు అనీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, గెస్ట్ ఆఫ్ హానర్గా ఓఐసి సమావేశంలో ప్రసంగించడం గొప్ప విషయమని అన్నారు.ఈ ప్రెస్ మీట్ లో ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి,అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రవనీష్ కుమార్ పాల్గొన్నారు
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









