పాక్ - భారత్ మధ్య మధ్యవర్తిత్వం లేదు
- March 02, 2019
అబుధాబి:పాకిస్తాన్, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో ఓఐసీ నుంచి ఎలాంటి మధ్యవర్తిత్వం లేదని భారత విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేననీ, ఈ విషయంలో ఇంకో మాటకు తావులేదని విదేశాంగ శాఖ కార్యదర్శుల్లో ఒకరైన టి.యస్ తిరుమూర్తి చెప్పారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ సమ్మిట్ సందర్భంగా అబుధాబిలో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు. కాగా, ఎంఇఎ అధికార ప్రతినిథి ఇండియా - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణంపై మాట్లాడేందుకు నిరాకరించారు. టి.యస్ తిరుమూర్తి మాట్లాడుతూ, ఈ శుక్రవారం చారిత్రాత్మకమైన రోజు అనీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, గెస్ట్ ఆఫ్ హానర్గా ఓఐసి సమావేశంలో ప్రసంగించడం గొప్ప విషయమని అన్నారు.ఈ ప్రెస్ మీట్ లో ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి,అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రవనీష్ కుమార్ పాల్గొన్నారు
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









