ఉప్పల్ వన్డేలో భారత్ ఘన విజయం
- March 02, 2019
ఆస్ట్రేలియాతో టి-20 సిరీస్లో దారుణంగా ఓడిపోయిన టీమిండియా, వన్డే సిరీస్లో జూలు విదిల్చింది. ఉప్పల్లో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ-37, విరాట్ కోహ్లీ-44, ధోనీ-59, కేదార్ జాదవ్- 81 పరుగు లతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అంతకుముందు… తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ఆసీస్లో ఉస్మాన్ ఖ్వాజా-50, మాక్స్వెల్-40, స్టైనిస్-37, అలెక్స్ క్యారీ-36, కౌల్టర్ నైల్-28 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు రెగ్యులర్గా వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ ఆటగాళ్లు దూకుడుగా ఆడ లేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్, షమీలు రెండేసి వికెట్లు సాధించగా, కేదార్ జాదవ్కు ఒక వికెట్ లభించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









