ఉప్పల్ వన్డేలో భారత్ ఘన విజయం
- March 02, 2019
ఆస్ట్రేలియాతో టి-20 సిరీస్లో దారుణంగా ఓడిపోయిన టీమిండియా, వన్డే సిరీస్లో జూలు విదిల్చింది. ఉప్పల్లో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ-37, విరాట్ కోహ్లీ-44, ధోనీ-59, కేదార్ జాదవ్- 81 పరుగు లతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అంతకుముందు… తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ఆసీస్లో ఉస్మాన్ ఖ్వాజా-50, మాక్స్వెల్-40, స్టైనిస్-37, అలెక్స్ క్యారీ-36, కౌల్టర్ నైల్-28 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు రెగ్యులర్గా వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ ఆటగాళ్లు దూకుడుగా ఆడ లేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్, షమీలు రెండేసి వికెట్లు సాధించగా, కేదార్ జాదవ్కు ఒక వికెట్ లభించింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







