ఉప్పల్ వన్డేలో భారత్ ఘన విజయం
- March 02, 2019
ఆస్ట్రేలియాతో టి-20 సిరీస్లో దారుణంగా ఓడిపోయిన టీమిండియా, వన్డే సిరీస్లో జూలు విదిల్చింది. ఉప్పల్లో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ-37, విరాట్ కోహ్లీ-44, ధోనీ-59, కేదార్ జాదవ్- 81 పరుగు లతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
అంతకుముందు… తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ఆసీస్లో ఉస్మాన్ ఖ్వాజా-50, మాక్స్వెల్-40, స్టైనిస్-37, అలెక్స్ క్యారీ-36, కౌల్టర్ నైల్-28 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు రెగ్యులర్గా వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ ఆటగాళ్లు దూకుడుగా ఆడ లేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్, షమీలు రెండేసి వికెట్లు సాధించగా, కేదార్ జాదవ్కు ఒక వికెట్ లభించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









