శారీరకంగా కాదు.. మానసికంగా వేధించారు.. అభినందన్ వర్ధమాన్
- March 03, 2019
శత్రు సైన్యం చేతిలో బందీగా ఉన్న సమయంలో తాను తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్టు భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఢిల్లీలోని ఎయిర్ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏఎఫ్సీఎంఈ)లో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పాకిస్థాన్ యుద్ధ విమానాలను తరిమికొట్టే క్రమంలో శత్రుదేశ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన అభినందన్.. తాను ప్రయాణిస్తున్న మిగ్21 విమానం కూలిపోవడంతో పాక్ గడ్డపై అడుగుపెట్టాడు. దీంతో అతను పాక్ ఆర్మీ వద్ద 48 గంటల పాటు బందీగా ఉన్నాడు.
ఆ తర్వాత అంతర్జాతీయ సమాజంతో పాటు.. ప్రపంచ దేశాల ఒత్తిడి, భారత దౌత్యనీతికి తలొగ్గిన పాకిస్థాన్ అభినందన్ను సురక్షితంగా భారత్కు అప్పగించింది. అభినందన్ భారత్కు చేరుకోగానే ఆస్పత్రికి తరలించి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాను పాకిస్థాన్ వద్ద బందీగా ఉన్న సమయంలో తీవ్ర మానసిక వేధింపులను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఆస్పత్రిలో ఉన్న అభినందన్ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్ధమాన్ వారితో మాట్లాడుతూ, దాదాపు 60 గంటలపాటు పాకిస్థాన్లో బందీగా ఉన్న తనను ఆ దేశ అధికారులు తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని చెప్పారు.
అయితే శారీరకంగా మాత్రం తనను హింసించలేదని తెలిపారు. భారత రక్షణ రహస్యాలను రాబట్టేందుకు పాక్ అధికారులు ఆయనను పలువిధాలుగా ప్రశ్నించారని, ఈ క్రమంలో ఆయనను మానసికంగా వేధించారని అధికార వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...









