కర్వా బస్లలో మహిళలకు రిజర్వేషన్
- December 28, 2015
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మహిళలకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం మౌసలాత్, కర్వా బస్సుల్లో తొలి రెండు వరుసల సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయించుకుంది. మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జస్సిమ్ బిన్ జైఫ్ అల్ సుల్తానీ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నామని మౌసలాత్ వెలషడించింది. కర్వా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నిర్వాహక సంస్థ అయిన మౌసలాత్, మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లను గుర్తించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసింది. ఇటీవల 150 కొత్త లో ఫ్లోర్ బస్సులు ప్రవేశపెట్టగా, అతి త్వరలో ఇంకో 150 బస్సుల్ని ప్రవేశపెట్టనుంది. వీల్ఛైర్కే పరిమితమైనవారు కూడా ఉపయోగించుకునేందుకు వీలుగా 55 బస్సుల్ని రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. కర్వా స్మార్ట్ కార్డ్ ద్వారా క్యాష్లెస్ ట్రావెలింగ్ సౌకర్యాన్ని ఇప్పటికే కల్పించారు ప్రయాణీకులకు. ఉదయం 4.30 నిమిషాల నుంచి రాత్రి 11.30 నిమిషాల వరకు 50 రూట్లలో సుమారు 2000 మౌసలాత్ బస్సుల్ని నడుపుతున్నారు. 2016లో మరో మూడు నుంచి నాలుగు కొత్త రూట్లు అలాగే ఇంకొన్ని బస్సుల్ని ప్రవేశపెట్టనున్నామని సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







