డీజిల్, కిరోసిన్ ధరల విధానానికి క్యాబినెట్ గ్రీన్సిగ్నల్
- December 28, 2015
బహ్రెయిన్ క్యాబినెట్ డీజిల్, కిరోసిన్ ధరలకు సంబంధించి కొత్త విధానానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం ద్వారా రానున్న రోజుల్లో డీజిల్, కిరోసిన్ ధరలు క్రమక్రమంగా పెరగనున్నాయి. డొమెస్టిక్ వినియోగదారులకు ఇది మింగుడుపడని విషయమే అయినా, దేశ ఆర్థిక ప్రగతిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అన్ని కోణాల్లోనూ పూర్తిగా పరిశీలంచి, కొత్త ధరల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎనర్జీ మినిస్టర్ అబ్దుల్ ముస్సేన్ బిన్ అలీ మీర్జా చెప్పారు. సబ్సిడీ, ప్రభుత్వ ఆదాయం వంటి అనేక అంశాల్లో సంబంధిత విభాగాల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి, నివేదికలు తెప్పించుకుని కొత్త ధరల విధానానికి శ్రీకారం చుట్టామని అన్నారాయన. ఈ విధానంతో దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తుందని చెప్పారు అలీ మీర్జా.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







