డీజిల్, కిరోసిన్ ధరల విధానానికి క్యాబినెట్ గ్రీన్సిగ్నల్
- December 28, 2015
బహ్రెయిన్ క్యాబినెట్ డీజిల్, కిరోసిన్ ధరలకు సంబంధించి కొత్త విధానానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం ద్వారా రానున్న రోజుల్లో డీజిల్, కిరోసిన్ ధరలు క్రమక్రమంగా పెరగనున్నాయి. డొమెస్టిక్ వినియోగదారులకు ఇది మింగుడుపడని విషయమే అయినా, దేశ ఆర్థిక ప్రగతిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అన్ని కోణాల్లోనూ పూర్తిగా పరిశీలంచి, కొత్త ధరల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎనర్జీ మినిస్టర్ అబ్దుల్ ముస్సేన్ బిన్ అలీ మీర్జా చెప్పారు. సబ్సిడీ, ప్రభుత్వ ఆదాయం వంటి అనేక అంశాల్లో సంబంధిత విభాగాల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి, నివేదికలు తెప్పించుకుని కొత్త ధరల విధానానికి శ్రీకారం చుట్టామని అన్నారాయన. ఈ విధానంతో దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తుందని చెప్పారు అలీ మీర్జా.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







