రోడ్డు ప్రమాదంలో నలుగురు టీనేజర్స్ మృతి
- March 09, 2019
రస్ అల్ ఖైమా:రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. రస్ అల్ ఖైమాలోని షేక్ మొహమ్మద్ జాయెద్ రోడ్డుపై ఎగ్జిట్ 122కి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందినవారంతా 15 నుంచి 19 ఏళ్ళ లోపు వయసువారే. రస్ అల్ ఖైమా ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కంట్రోల్ హెడ్ కల్నల్ మొహమ్మద్ అల్ బహ్మార్ మాట్లాడుతూ, సాయంత్రం 6.55 నిమిషాల సమయంలో తమకు సమాచారం అందిందని చెప్పారు. ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి రికార్డు సమయంలో చేరుకోవడం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఎమిరేటీలు ఒక ఆసియా వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ఎమిరేటీ యువకులు కూడా గాయపడ్డారు. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









