రోడ్డు ప్రమాదంలో నలుగురు టీనేజర్స్ మృతి
- March 09, 2019
రస్ అల్ ఖైమా:రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. రస్ అల్ ఖైమాలోని షేక్ మొహమ్మద్ జాయెద్ రోడ్డుపై ఎగ్జిట్ 122కి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందినవారంతా 15 నుంచి 19 ఏళ్ళ లోపు వయసువారే. రస్ అల్ ఖైమా ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కంట్రోల్ హెడ్ కల్నల్ మొహమ్మద్ అల్ బహ్మార్ మాట్లాడుతూ, సాయంత్రం 6.55 నిమిషాల సమయంలో తమకు సమాచారం అందిందని చెప్పారు. ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి రికార్డు సమయంలో చేరుకోవడం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఎమిరేటీలు ఒక ఆసియా వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ఎమిరేటీ యువకులు కూడా గాయపడ్డారు. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!









