రోడ్డు ప్రమాదంలో నలుగురు టీనేజర్స్ మృతి
- March 09, 2019రస్ అల్ ఖైమా:రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. రస్ అల్ ఖైమాలోని షేక్ మొహమ్మద్ జాయెద్ రోడ్డుపై ఎగ్జిట్ 122కి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతి చెందినవారంతా 15 నుంచి 19 ఏళ్ళ లోపు వయసువారే. రస్ అల్ ఖైమా ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కంట్రోల్ హెడ్ కల్నల్ మొహమ్మద్ అల్ బహ్మార్ మాట్లాడుతూ, సాయంత్రం 6.55 నిమిషాల సమయంలో తమకు సమాచారం అందిందని చెప్పారు. ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి రికార్డు సమయంలో చేరుకోవడం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఎమిరేటీలు ఒక ఆసియా వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ఎమిరేటీ యువకులు కూడా గాయపడ్డారు. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ