ఢిల్లీ:కారులో సజీవదహనమైన తల్లీకూతుళ్లు..
- March 11, 2019ఢిల్లీ:ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తల్లి సహా ఇద్దరు కూతుళ్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని అక్షర్ధామ్ ఫ్లైఓవర్పై జరిగింది. ఢిల్లీకి చెందిన ఉపేంద్ర మిశ్రా అతని భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి పనిమీద బయటికి వెళ్లారు. అయితే కారు అక్షర్ధామ్ గుడివద్దకు రాగానే కారులో గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో డ్రైవర్ సీట్లో ఉన్న ఉపేంద్ర ఒక కూతురుని తీసుకుని బయటకు దూకేశాడు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడి భార్య రంజనా మిశ్రా, కూతుళ్లు నిక్కీ, రిధి సజీవదహనమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా భార్య పిల్లలు కాలి బూడిద అవ్వడంతో ఉపేంద్ర ఎటువంటి సమాచారం ఇచ్చే పరిస్థితిలో లేడని పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ