మాజీ భార్యపై పెట్రోల్ చల్లి చంపేస్తానని బెదిరింపు
- March 11, 2019
యూ.ఏ.ఈ:ఓ వ్యక్తి తన మాజీ భార్యపై పెట్రోల్ చల్లి ఆమెను చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కాగా, కోర్టులో విచారణ జరుగుతోంది. బని యాస్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో విచారణ జరుగుతున్నట్లు ఈ కేసు గురించి అధికారులు చెప్పారు. నిందితుడు ఘటన జరిగిన సమయంలో డ్రగ్స్ సేవించి వున్నాడని వారు వివరించారు. దాడికి యత్నించిన తన మాజీ భర్తపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కాగా, విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు. ఇదిలా వుంటే, న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







