పద్మ అవార్డు ప్రధానోత్సవ వేడుక..
- March 11, 2019
పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఉత్సాహంగా సాగింది. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి పద్మ అవార్డులను ప్రధానం చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. నాట్య రంగంలో అమోఘమైన ప్రతిభను కనబరిచినందుకుగానూ ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించింది.
ఇండియన్ మైఖెల్ జాక్సన్గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా తన 25 ఏళ్ల కెరీర్లో ఎన్నో విభిన్నమైన డ్యాన్సింగ్ స్టయిల్స్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. ఉత్తమ కొరియోగ్రాఫర్గా రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాదాపు 13 చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు.
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. 2001లో మోహన్లాల్ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మోహన్లాల్ దాదాపు 300 చిత్రాల్లో నటించారు.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









