పదవతరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు

- March 13, 2019 , by Maagulf
పదవతరగతి అర్హతతో రైల్వే ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 1,03,769 లెవల్-1 (గ్రూప్-డి) పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 12 సాయింత్రం 5 గంటలకు ప్రారంభమైంది. 
అర్హత: పదవతరగతి లేదా ఐటీఐ లేదా తత్సమాన విద్యార్హత లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: మార్చి 12 నుంచి ఏప్రిల్ 12 వరకు
పరీక్ష ఫీజు: రూ.500
పరీక్షకు హాజరైన అభ్యర్థులకు తిరిగి రూ.400లు ఇచ్చేస్తారు. 
దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. వీరికి పరీక్ష సమయంలో పూర్తి ఫీజును తిరిగి చెల్లిస్తారు. 
ముఖ్యమైన తేదీలు:
ఉద్యోగ ప్రకటన: 23.02.2019
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2019
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:
ఆన్‌లైన్ (నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/యూపీఐ) : 23.04.2019
ఎస్‌బీఐ చలానా/ పోస్టాఫీస్ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 18.04.2019
దరఖాస్తు తుది సమర్పణకు చివరి తేదీ: 26.04.2019
రాత పరీక్ష (సీబీటీ) : సెప్టెంబరు-అక్టోబరులో
వెబ్‌సైట్: http://rrbsecunderabad.nic.in
ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి: https://scr.rly-rect-appn.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com