ప్రాణాలకు భరోసా అంటూ లేదు ప్రభుత్వానికి మా గురించి పట్టింపు లేదు
- March 22, 2019
ఆకలివేదన వలసపొమ్మన్నోళ్ళం-
రా(ష్టాలు దాటివచ్చి కడుపునింపుకుంటున్నోళ్ళం-
ఏడారుల్లో చిక్కుకొని బతుకులు అర్పిస్తున్నాం-
ఏవ్వరికీ పట్టనోళ్ళం-
కష్టాన్నీ నమ్మే వలస జీవులం
వయస్సును దారపోసే చేదునిజాలం-
అంబారాన్ని అంటే కట్టడాల మద్య జీవితాలు-
రాలిపోతున్న ఆశలు-
ఇరుకు గదుల జీవనం-
మా పిల్లలకు ప్రేమలు పంచలేని దుర్బలులం-
ఏమని చెప్పాలి మా వేదన-
ఎవ్వరికీ అర్దంకాని కన్నీటి రోదన-
నెల మొత్తం చేస్తే వచ్చేది తొమ్మిది వందలే-బతుకుతెల్లారాలంటే సాగిపోవాలి ఇలాగే-
తలరాత మారనోళ్ళం-
రేపటి ఉషోదయం కోసం ఏదురుచూస్తున్నోళ్ళం** * * *
ప్రాణాలకు భరోసా అంటూ లేదు
ప్రభుత్వానికి మా గురించి పటింపు లేదు
నాంకెవస్తు వాగ్దానం నవ్వుతూనే కట్టిపడేసే నాయకులు
బ్రతకపోయినోనికి ఎందుకు భరోసా
పాలసీలు.....అంటే
ఉత్తి ఉత్తవే అనే సంగతి తెలియదు
సంసారాన్ని సముద్రలు దాటి మొసేటోళ్లకు
NRI అన్నలు
"చూస్తూనే ఉండండి-
గోడమీద రాసుకొని రేపు అన్న పదాన్ని-
ఏదురుతిరిగి పోరాడనంతకాలం;
మీ పిల్లలకు మీ చేతుకు వచ్చేంత ఆగండి ;
వాళ్ళను కూడా ఇక్కడనే బానిసలు చేయండి
మా బండగుండెలు బద్దలయ్యేంత వరకు;
జిరాక్స్ తల రాతనుకొని
గోడమీద రేపుని చూస్తూనే ఉండండి-
అత్యాశతో....
ఇట్లు
ఆకుల రామచంద్ర (దుబాయ్)
రాచర్ల గొల్లపల్లి
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









