భారత్‌ నుంచి ఐదేళ్ళ తర్వాత స్వదేశం చేరుకోనున్న ఒమన్‌ సిటిజన్‌

- March 26, 2019 , by Maagulf
భారత్‌ నుంచి ఐదేళ్ళ తర్వాత స్వదేశం చేరుకోనున్న ఒమన్‌ సిటిజన్‌

మస్కట్‌: ఓ కేసులో అరెస్టయి ఐదేళ్ళుగా భారత్‌లోనే వుండిపోయిన ఒమనీ సిటిజన్‌ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకోనున్నారు. ఇండియాలోని ఒమన్‌ ఎంబసీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఒమనీ ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ ఈ అంశంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాయని ఎంబసీ పేర్కొంది. పౌరుడు రషీద్‌ అల్‌ మదస్సారి ఓ కేసులో అరెస్టయ్యారు. కాగా, ఇండియన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌ కూడా ఒమన్‌ ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించడంతో రషీద్‌ విడుదలకు మార్గం సుగమం అయ్యింది. అడ్మినిస్ట్రేటివ్‌ ప్రొసిడ్యూర్స్‌ అనంతరం స్వదేశానికి రషీద్‌ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. దీనికి కొంత సమయం పడుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com