బటన్ నొక్కినందుకు నెలకు లక్షా 72 వేల జీతం!!
- March 29, 2019
స్వీడన్:పొద్దున్నించి సాయింత్రం దాకా కష్టపడితేనే బాస్ బతకనిస్తాడు.. నెల వచ్చేసరికి జీతం ఇవ్వాలంటే ఏడుస్తాడు. అలాంటిది ఒక్క బటన్ నొక్కినందుకే అంత జీతమా.. ఎక్కడో చెప్పవా మేం కూడా అప్లై చేస్తాము. పక్క రాష్ట్రమైనా పర్లేదు.. కానీ ఎక్కడో స్వీడన్ దేశంలో ఈ ఉద్యోగం. అయినా వెళ్తానంటే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అస్సలు చదువుకోక పోయినా పర్లేదని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది కంపెనీ. మరింకెందుకు ఆలస్యం… ఉద్యోగ వివరాలు చూస్తే..
స్వీడన్ ప్రభుత్వం గోథెన్బర్గ్లోని కోర్వ్సేగన్ ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్ ప్రాజెక్టుని చేపట్టింది. ఇందులో ఓ ఉద్యోగానికి భారీ ప్రకటన ఇచ్చింది. ఇంతకీ ఏమా ఉద్యోగం, ఎంత క్వాలిఫికేషన్ కావాలో అని నిరుద్యోగులంతా ఆత్రంగా పేపర్ ప్రకటన చూశారు. అర్హతలు, అనుభవం వంటివి ఏమీ అక్కర్లేదనే సరికి మరికొంత ఆసక్తి కలిగింది వారికి. ఆహా ఎంత మంచి ఉద్యోగం అని ఎగిరి గంతేశారు. ఇంతకీ ఏం చేయాలి అని చూస్తే..
డ్యూటీలోకి రాగానే స్టేషన్లో ఉన్న గడియారం దగ్గర ఉన్న బటన్ నొక్కితే చాలు. అక్కడ స్టేషన్లో అమర్చిన బల్బులన్నీ వెలుగుతాయి. ఆ తరువాత ఇంక పనేం ఉండదు. నిద్రొస్తే పడుకోవచ్చు. బోరు కొడితే బయటకు వెళ్లొచ్చు. అలా సాయింత్రం వరకు కాలక్షేపం చేసి వచ్చి మళ్లీ సమయానికి బటన్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్లి పోవచ్చు. నచ్చినన్ని రోజులు చేయొచ్చు. ఒకవేళ మీకీ ఉద్యోగం నచ్చలేదనుకోండి నిరభ్యంతరంగా మానేయొచ్చు.
లేదు బావుంది ఇక్కడే ఉంటానంటే కూడా ఓకే చెబుతుంది కంపెనీ.. అక్కడే రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చట. నెల జీతం 2,500 డాలర్లు (మన కరెన్సీలో రూ.1.72 లక్షలు) ఫస్ట్ రాకముందే అకౌంట్లో పడిపోతాయి. జీతం ఒక్కటే కాదండోయ్ మరికొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయట.. ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్సులు, సెలవులు, రిటైర్ అయ్యాక పింఛన్ వంటివన్నీ ఉంటాయట. ఆగండాగండి అప్లై చేయడానికి రెడీ అయిపోయారా.. రైల్వే స్టేషన్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదట. అది పూర్తయిన తరువాత అప్లై చేసుకోండి.. బెస్టాఫ్ లక్.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







