వడోదర లో భారీ షూటింగ్ ప్లాన్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్
- March 29, 2019
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. ఈ సినిమాకు సంబంధించిన అంశాలను కొద్దిరోజుల పాటు గుట్టుగా ఉంచాడు రాజమౌళి. దీంతో ఈ సినిమాలో నటిస్తున్న రామ్చరణ్, ఎన్టీఆర్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? ఎవరిని ఎలా చూపిస్తారు..? తదితర అంశాలపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ.. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. తన సహజ శైలికి భిన్నంగా రాజమౌళి ఏకంగా మీడియా ముందుకు వచ్చి కథాకథనం వివరాలు వెల్లడించారు.
ఇందులో ఎన్టీఆర్, రాంచరణ్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? కథ ఏమిటి..? తదితర కీలక విషయాలను వెల్లడించి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఇక తాజా విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ను ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. గుజరాత్లోని వడోదర నగరంలోఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ చిత్రీకరణ మొదలువుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని తారక్ సోషల్మీడియా ద్వారా వెల్లడిస్తూ.. విమాన టికెట్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'ఆర్ ఆర్ ఆర్ భారీ షెడ్యూల్.. నేను బయలుదేరుతున్నాను' అని ట్వీట్ చేశారు.
ఆర్ ఆర్ ఆర్ గురించి ఎన్టీఆర్ ఇలా ఈ ట్వీట్ చేయడమే ఆలస్యం.. అలా కొన్నివేల మంది లైక్ చేయడం గమనార్హం. 'హ్యాపీ జర్నీ అన్నా.. మాకు ఇలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండు' అంటూ అభిమానులు సంబురపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో తారక్.. కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్నారు. చరణ్కు జోడీగా ఆలియా భట్, ఎన్టీఆర్కు జోడీగా డైసీ అడ్గార్జోన్స్ నటించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు. సినిమాను 2020 జులై 30న అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







