శరవణభవన్‌ హోటల్ అధినేత రాజగోపాల్‌కు జీవితఖైదు

- March 30, 2019 , by Maagulf
శరవణభవన్‌ హోటల్ అధినేత రాజగోపాల్‌కు జీవితఖైదు

చెన్నై:తన సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పెళ్లి చేసుకునేందుకు, ఆమె భర్తను కిరాయిమూకలతో హత్య చేయించిన కేసులో చెన్నైకి చెందిన ప్రఖ్యాత శరవణభవన్‌ హోటల్స్‌ అధినేత రాజగోపాల్‌కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. పదేళ్ల కిందటే మద్రాసు హైకోర్టు ఆయనకు జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇవ్వగా, దాన్ని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ముద్దాయిలందరూ జూలై 7లోపు చెన్నై కోర్టులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com