పుస్తకంలో పెట్టి మర్చిపోయిన లాటరీకి రూ.5 కోట్ల 14 లక్షలు..
- April 04, 2019
కెనడా:ఏదో అందరూ కొంటున్నారని వాళ్లూ కొన్నారు. ఇంటికి వెళ్లాక ఎక్కడో పెట్టి ఆ విషయాన్నే మరచి పోయారు. తీరా చూస్తే అదే టికెట్ కోట్ల రూపాయలు తెచ్చి పెట్టింది.
కెనడాకు చెందిన ఓ జంట లాటరీ టికెట్ కొని దాని గురించి పట్టించుకోకుండా మనవడి స్కూలు పుస్తకాల షెల్ఫ్లో పెట్టారు. ఓ రోజు వాడేదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని దానికి సంబంధించిన పుస్తకాల కోసం షెల్ఫ్లో వెతుకుతున్నాడు. అక్కడ లాటరీ టికెట్ కనిపించింది. అది తీస్కెళ్లి తాతకి ఇచ్చాడు. దాంతో తాత ఎప్పుడో కొన్నాం రా ఇది.
ఇంకా టైమ్ వుందో లేదోనని ఓ సారి చెక్ చేయమంటూ కొడుక్కి ఆ టికెట్ ఇచ్చారు. లాటరీ వెబ్ సైట్లో చెక్ చేయగా ఇంకా రెండు రోజులే టైమ్ ఉంది. ఇంతకీ లాటరీ తగిలిందో లేదో అని చూసుకుంటే.. 10 లక్షల డాలర్లు (రూ.5 కోట్ల 14 లక్షలు) లాటరీ తగిలినట్లు తెలుసుకున్నారు. పట్టించుకోకుండా పక్కన పడేసిన లాటరీ టికెట్కి అంత ప్రైజ్ మనీ వచ్చే సరికి మనవడిని ముద్దులతో ముంచెత్తారు తాతగారు. నీ వల్లే రా మనవడా ఈ రోజు మనం కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







