పుస్తకంలో పెట్టి మర్చిపోయిన లాటరీకి రూ.5 కోట్ల 14 లక్షలు..
- April 04, 2019
కెనడా:ఏదో అందరూ కొంటున్నారని వాళ్లూ కొన్నారు. ఇంటికి వెళ్లాక ఎక్కడో పెట్టి ఆ విషయాన్నే మరచి పోయారు. తీరా చూస్తే అదే టికెట్ కోట్ల రూపాయలు తెచ్చి పెట్టింది.
కెనడాకు చెందిన ఓ జంట లాటరీ టికెట్ కొని దాని గురించి పట్టించుకోకుండా మనవడి స్కూలు పుస్తకాల షెల్ఫ్లో పెట్టారు. ఓ రోజు వాడేదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని దానికి సంబంధించిన పుస్తకాల కోసం షెల్ఫ్లో వెతుకుతున్నాడు. అక్కడ లాటరీ టికెట్ కనిపించింది. అది తీస్కెళ్లి తాతకి ఇచ్చాడు. దాంతో తాత ఎప్పుడో కొన్నాం రా ఇది.
ఇంకా టైమ్ వుందో లేదోనని ఓ సారి చెక్ చేయమంటూ కొడుక్కి ఆ టికెట్ ఇచ్చారు. లాటరీ వెబ్ సైట్లో చెక్ చేయగా ఇంకా రెండు రోజులే టైమ్ ఉంది. ఇంతకీ లాటరీ తగిలిందో లేదో అని చూసుకుంటే.. 10 లక్షల డాలర్లు (రూ.5 కోట్ల 14 లక్షలు) లాటరీ తగిలినట్లు తెలుసుకున్నారు. పట్టించుకోకుండా పక్కన పడేసిన లాటరీ టికెట్కి అంత ప్రైజ్ మనీ వచ్చే సరికి మనవడిని ముద్దులతో ముంచెత్తారు తాతగారు. నీ వల్లే రా మనవడా ఈ రోజు మనం కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









