పుస్తకంలో పెట్టి మర్చిపోయిన లాటరీకి రూ.5 కోట్ల 14 లక్షలు..
- April 04, 2019
కెనడా:ఏదో అందరూ కొంటున్నారని వాళ్లూ కొన్నారు. ఇంటికి వెళ్లాక ఎక్కడో పెట్టి ఆ విషయాన్నే మరచి పోయారు. తీరా చూస్తే అదే టికెట్ కోట్ల రూపాయలు తెచ్చి పెట్టింది.
కెనడాకు చెందిన ఓ జంట లాటరీ టికెట్ కొని దాని గురించి పట్టించుకోకుండా మనవడి స్కూలు పుస్తకాల షెల్ఫ్లో పెట్టారు. ఓ రోజు వాడేదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని దానికి సంబంధించిన పుస్తకాల కోసం షెల్ఫ్లో వెతుకుతున్నాడు. అక్కడ లాటరీ టికెట్ కనిపించింది. అది తీస్కెళ్లి తాతకి ఇచ్చాడు. దాంతో తాత ఎప్పుడో కొన్నాం రా ఇది.
ఇంకా టైమ్ వుందో లేదోనని ఓ సారి చెక్ చేయమంటూ కొడుక్కి ఆ టికెట్ ఇచ్చారు. లాటరీ వెబ్ సైట్లో చెక్ చేయగా ఇంకా రెండు రోజులే టైమ్ ఉంది. ఇంతకీ లాటరీ తగిలిందో లేదో అని చూసుకుంటే.. 10 లక్షల డాలర్లు (రూ.5 కోట్ల 14 లక్షలు) లాటరీ తగిలినట్లు తెలుసుకున్నారు. పట్టించుకోకుండా పక్కన పడేసిన లాటరీ టికెట్కి అంత ప్రైజ్ మనీ వచ్చే సరికి మనవడిని ముద్దులతో ముంచెత్తారు తాతగారు. నీ వల్లే రా మనవడా ఈ రోజు మనం కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







