పబ్లిక్ పార్క్లో తొలి స్కేటింగ్ ఫెసిలటీ
- April 05, 2019
యూఏఈలో తొలిసారిగా పబ్లిక్ పార్క్లో స్కేటింగ్ ఫెసిలిటీని ప్రారంభించబోతున్నారు. మే నెలలో దీన్ని ప్రారంభిస్తామని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. సక్ర్ పార్క్లో ఈ స్కేట్ పార్క్ నిర్మాణం కోసం పనులు వేగంగా సాగుతున్నాయి. 620 మీటర్ల పొడవైన స్కేటింగ్ పార్క్ ఘాప్ ట్రీ రిజర్వ్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన నీడలో స్కేటింగ్ని ఔత్సాహికులు ఎంజాయ్ చేయడానికి ఆస్కారమేర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. బౌల్, పిరమిడ్స్, లెడ్జెస్, బ్యాంక్స్ మరియు రౌండ్ రెయిల్స్ వంటి అబ్స్టాకిల్స్ని స్కేటర్స్కి డిఫరెంట్ లెవల్స్లో ఇక్కడ పొందుపరుస్తున్నారు. స్కేట్ బోర్డింగ్, రోలర్ బ్లేడింగ్ మరియు బిఎంఎక్స్ బైక్ రైడింగ్ వంటి సౌకర్యాలతో ఇకపై ఈ పార్క్ సరికొత్త శోభను సంతరించుకోబోతోందని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ హైతమ్ మట్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







