దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- April 05, 2019
మస్కట్: బౌషర్లో ముగ్గురు అరబ్ జాతీయుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ కారు అద్దాల్ని పగులగొట్టి, అందులోని డబ్బుని కొల్లగొట్టినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. 12,000 ఒమన్ రియాల్స్కి పైగా నిందితులు కారులోంచి దొంగిలించారు. ఒమన్కి టూరిస్ట్ వీసాపై నిందితులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్ నుంచి బాధిత వ్యక్తి డబ్బుతో రావడం గమనించిన నిందితులు, అతన్ని ఫాలో అయ్యారనీ, కారు పార్క్ చేసి బాధితుడు వెళ్ళగానే అందులోంచి నగదు దొంగిలించారనీ అధికారులు వివరించారు. డబ్బును బ్యాంకు నుంచి తీసేటప్పుడు, దాన్ని తరలించేటప్పుడు అప్రమత్తంగా వుండాలని రాయల్ ఒమన్ పోలీస్, సిటిజన్స్ అలాగే నివాసితులకు సూచించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







