దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- April 05, 2019మస్కట్: బౌషర్లో ముగ్గురు అరబ్ జాతీయుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ కారు అద్దాల్ని పగులగొట్టి, అందులోని డబ్బుని కొల్లగొట్టినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. 12,000 ఒమన్ రియాల్స్కి పైగా నిందితులు కారులోంచి దొంగిలించారు. ఒమన్కి టూరిస్ట్ వీసాపై నిందితులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్ నుంచి బాధిత వ్యక్తి డబ్బుతో రావడం గమనించిన నిందితులు, అతన్ని ఫాలో అయ్యారనీ, కారు పార్క్ చేసి బాధితుడు వెళ్ళగానే అందులోంచి నగదు దొంగిలించారనీ అధికారులు వివరించారు. డబ్బును బ్యాంకు నుంచి తీసేటప్పుడు, దాన్ని తరలించేటప్పుడు అప్రమత్తంగా వుండాలని రాయల్ ఒమన్ పోలీస్, సిటిజన్స్ అలాగే నివాసితులకు సూచించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..