దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్‌

- April 05, 2019 , by Maagulf
దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్‌

మస్కట్‌: బౌషర్‌లో ముగ్గురు అరబ్‌ జాతీయుల్ని దొంగతనం కేసులో అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఓ కారు అద్దాల్ని పగులగొట్టి, అందులోని డబ్బుని కొల్లగొట్టినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. 12,000 ఒమన్‌ రియాల్స్‌కి పైగా నిందితులు కారులోంచి దొంగిలించారు. ఒమన్‌కి టూరిస్ట్‌ వీసాపై నిందితులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్‌ నుంచి బాధిత వ్యక్తి డబ్బుతో రావడం గమనించిన నిందితులు, అతన్ని ఫాలో అయ్యారనీ, కారు పార్క్‌ చేసి బాధితుడు వెళ్ళగానే అందులోంచి నగదు దొంగిలించారనీ అధికారులు వివరించారు. డబ్బును బ్యాంకు నుంచి తీసేటప్పుడు, దాన్ని తరలించేటప్పుడు అప్రమత్తంగా వుండాలని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, సిటిజన్స్‌ అలాగే నివాసితులకు సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com