ఒక్క రూపాయికే పోకో ఎఫ్1 స్మార్ట్ఫోన్
- April 05, 2019చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమీ మరో సంచలనానికి తెరతీసింది. ఉగాది సందర్భంగా ‘ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్2019’ ను ప్రకటించింది. మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది షావోమీ.
ఏప్రిల్ 4వ తేదిన ఫ్లాష్ సేల్లో ఒక్క రూపాయికే రెడ్మీ నోట్ 7 ప్రో, ఎంఐ సౌండ్బార్ వంటివి విక్రయించింది షావోమీ. ఇక 5 న మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది షావోమీ. ఈ సేల్లో పోకో ఎఫ్1 స్మార్ట్ఫోన్ను రూ.1 కే పొందవచ్చు. మొత్తం 20 స్మార్ట్ఫోన్లను రూపాయికే విక్రయించనున్నట్లు ప్రకటించింది షావోమీ.
ఈ స్మార్ట్ఫోన్తో పాటు హోమ్ సెక్యూరిటీ కెమెరా బేసిక్ను కూడా రూపాయికే విక్రయించనున్నట్లు బంపర్ ఆఫర్ ప్రకటించింది షావోమీ. ఈ సేల్లో 20 హోమ్ కెమెరా యూనిట్లు ఉంటాయిని తెలిపింది. ఏప్రిల్ 6వ తేది వరకు ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 జరగనుంది.
ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫ్లాష్ సేల్ స్టార్ అవుతుంది. ఈ ఆఫర్లు పొందాలంటే mi.com వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. లేదా యాప్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు. ఫ్లాష్ సేల్ కాబట్టి సెకనుల్ల వ్యవధిలోనే సేల్ ముగిసిపోతుంది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..