ముంబయి విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- April 05, 2019ముంబయి : ముంబయి విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. చెప్పుల్లో పెట్టి బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ముంబయి విమనాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన చేసుకుంది. అమెరికా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీ చేసింది. దీంతో సదరు నిందితుడి వద్ద నుంచి రూ. 11 లక్షల విలువైన 381 గ్రాముల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెప్పుల్లో బంగారం బిస్కెట్లను అక్రమ రవాణా చేస్తుండడంపై అధికారులు ఆశ్చర్యపోయారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే