రాష్ట్రంలో మార్చి చివరి నాటికి 2 లక్షల గృహాలు..
- December 30, 2015
రాష్ట్రంలో మార్చి చివరి నాటికి 2 లక్షల గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన చైైర్మన వర్ల రామయ్య అన్నారు. బుధవారం మార్కెట్యార్డు ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం నుంచి పట్టణాలకు 1 లక్షా 93 వేల గృహాలు మంజూరయ్యాయన్నారు. ఇదంతా చంద్రబా బునాయుడు కృషేనన్నారు. రానున్న 3 సంవత్స రాలలో మరో 10 లక్షల గృహాలు నిర్మించే అవకా శం ఉందన్నారు. పేదలందరికి పక్కా గృహాలు నిర్మించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహా నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబా బునాయు డు అడుగడుగున పర్యవేక్షిస్తారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గృహాల నిర్మాణానికి బడ్జెట్ను పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కు తుందన్నారు. ఒక్కొక్క గృహ నిర్మాణానికి రూ. 2 లక్షల 75 వేలు మంజూరు చేయటం జరుగు తుందన్నారు. ఎస్సీ లకు మరుగుదొడ్డి నిర్మాణ నిమిత్తం అదనంగా మరో రూ.15 వేలు మంజూ రు చేస్తామన్నారు. పేదవాడి ఎదుగుదలను టీడీపీ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. పూరిల్లు లేని సమాజం చూడాలన్నదే చంద్రబాబునా యుడు లక్ష్యమన్నారు. సీఎం మహా యజ్ఞంలో సమిధలులా పని చేసే అవకాశం తమకు కల్పించారన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మె ల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మున్సిపల్ చైైైర్మన యెల్లినేడి రామస్వామి, ఎంపీపీ బొర్రా కోటేశ్వ రరావు, మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైైర్మన మక్కపాటి రామచంద్రరావు, ముసునూరి శేఖ ర్బాబు, ముప్పాళ్ళ ఎంపీపీ ఉమాదేవి, తెలు గు మహిళా నాయకురాలు భీమినేని వంద నా దేవి, దేశం నాయకులు బత్తుల చంద్రశేఖర్, వ క్కంటి అజయ్, అంకాళ్ళ ప్రభుదాసు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









