హైదరాబాద్: మెట్రో సేవలకు అంతరాయం
- April 05, 2019
హైదరాబాద్లో మెట్రో సేవలకు కాసేపు అంతరాయం కలిగింది. రైల్వే ట్రాక్లపై ఫ్లెక్సీలు పడడంతో మెట్రో ట్రైన్లను కొద్దిసేపు నిలిపేశారు. ఫలితంగా హైటెక్సిటీకి వెళ్లే దారిలో మెట్రో ట్రైన్లు కాసేపు ఆగిపోయాయి. ఈ సాయంత్రం భాగ్య నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు విపరీతమైన ఎండతో అల్లాడిపోగా, అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది. ఉరుములు-మెరుపులతో వర్షం పడింది. ఈదురుగాలులు వీశాయి. ఆ గాలుల ధాటికి ఫ్లెక్సీలు తెగి రైల్వే ట్రాక్లపై పడిపోయాయి. దాంతో ఆ మార్గంలో ట్రైన్ సర్వీసులను ఆపేశారు. ట్రాక్లపై నుంచి ఫ్లెక్సీలను తొలగించిన తర్వాత మళ్లీ మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







