రైల్వే ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు..
- April 08, 2019
వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న మినిస్టీరియల్ ఐసోలేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పొడిగించింది. మార్చి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై ఏప్రిల్ 7తో ముగియనుంది. అయితే దరఖాస్తు గడువు తేదీన ఏప్రిల్ 22 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ఆర్బీ నిర్ణయం తీసుకుంది.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించి ఏప్రిల్ 22 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 28లోగా, ఎస్బీఐ/పోస్టాఫీస్ చలాన్ ద్వారా ఏప్రిల్ 26 మధ్యాహ్నం 1 గంటలోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల తుది సమర్పణకు ఏప్రిల్ 30ని తుదిగడువుగా నిర్ణయించారు.
రైల్వేలో మొత్తం 1665 మినిస్టీరియల్, ఐసోలేటెడ్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఫిబ్రవరి చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేశారు. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితిని నిర్ణయించారు. ఆన్లైన్ రాత పరీక్ష, స్టెనోగ్రఫీ టెస్ట్, పెర్ఫార్మెన్స్ టెస్ట్/టీచింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంటరీ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్-జులై మధ్యకాలంలో అభ్యర్థులకు సీబీటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని తదుపరి పరీక్షలకు ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







