లేబర్ చట్టం ఉల్లంఘన: 340 మంది వలసదారుల అరెస్ట్
- April 09, 2019మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం 340 మంది వలస కార్మికుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన కింద అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయినవారిలో 240 మంది కమర్షియల్ వర్కర్స్ కాగా, 19 మంది అగ్రికల్చరల్ వర్కర్స్, 67 మంది హౌస్మెయిడ్స్ వున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 మధ్య ఈ అరెస్టులు జరిగాయని మినిస్ట్రీ పేర్కొంది. విచారణలో 222 మంది అబ్స్కాండింగ్ వర్కర్స్ అనీ, 107 మంది లెయిడ్ ఆఫ్ వర్కర్స్ అనీ, 11 మంది వద్ద ఎలాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ లేవనీ తేలింది. మస్కట్ గవర్నరేట్లో అత్యధికంగా 200 మంది అరెస్ట్ అయ్యారు. నార్త్ బతినాలో 56 మంది అరెస్టయ్యారు. కాగా, 469 మంది అక్రమ వలసదారుల్ని ఈ పీరియడ్లో దేశం నుంచి బహిష్కరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ