రోడ్డు ప్రమాదానికి గురైన స్కూల్ బస్
- April 11, 2019
బహ్రెయిన్: మేజర్ హైవేపై స్కూల్ బస్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే ఈ ప్రమాదం కారణంగా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే - షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్, మరో రెండు వాహనాలు ఈ ప్రమాదానికి గురయ్యాయి. ఇదిలా వుంటే, షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబా స్ట్రీట్లో ట్రక్ ఒకటి ట్రాఫిక్ సిగ్నల్లోకి దూసుకెళ్ళడంతో మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగానూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా వుంటే ఈ వారం పలు ప్రమాదాలు జరిగాయి. 18 ఏళ్ళ బాలుడు ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







