విద్యార్థుల అస్వస్థతో దుబాయ్‌ స్కూల్‌కి రెండు రోజుల సెలవు

- April 11, 2019 , by Maagulf
విద్యార్థుల అస్వస్థతో దుబాయ్‌ స్కూల్‌కి రెండు రోజుల సెలవు

దుబాయ్‌ స్కూల్‌, విద్యార్థుల అనారోగ్యం కారణంగా రెండు రోజులు మూతపడింది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు. దుబాయ్‌లోని అల్‌ గర్హౌద్‌లో గల కిండర్‌గార్టెన్‌ స్టార్టర్స్‌, తమ విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్‌ సెలవుల విషయమై సమాచారం అందించింది. ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో స్కూల్‌ని మూసివేసి, డీప్‌ క్లీన్‌ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్‌ మునిసిపాలిటీ మరియు దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ ఈ స్కూల్‌ని ఇప్పటికే సందర్శించడం జరిగింది. నాలెడ్జ్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి సైతం సమాచారం ఇచ్చారు. వివిధ క్లాసులకు చెందిన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, తమ పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తాయనీ వాంతులు, జ్వరంతో వారు బాధపడుతున్నారనీ ఫిర్యాదు చేయడంతో స్కూల్‌ యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com