విద్యార్థుల అస్వస్థతో దుబాయ్ స్కూల్కి రెండు రోజుల సెలవు
- April 11, 2019దుబాయ్ స్కూల్, విద్యార్థుల అనారోగ్యం కారణంగా రెండు రోజులు మూతపడింది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు. దుబాయ్లోని అల్ గర్హౌద్లో గల కిండర్గార్టెన్ స్టార్టర్స్, తమ విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ సెలవుల విషయమై సమాచారం అందించింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో స్కూల్ని మూసివేసి, డీప్ క్లీన్ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్ మునిసిపాలిటీ మరియు దుబాయ్ హెల్త్ అథారిటీ ఈ స్కూల్ని ఇప్పటికే సందర్శించడం జరిగింది. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీకి సైతం సమాచారం ఇచ్చారు. వివిధ క్లాసులకు చెందిన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, తమ పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తాయనీ వాంతులు, జ్వరంతో వారు బాధపడుతున్నారనీ ఫిర్యాదు చేయడంతో స్కూల్ యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత