ఎల్ఐసీ కొత్త పాలసీ.. పిల్లల భవిష్యత్తు కోసం రోజుకు రూ.206 పెట్టుబడి
- April 12, 2019
పిల్లలకు మంచి భవిష్యత్ని అందించాలని ప్రతి తల్లీ, తండ్రి కలలు కంటారు. కష్టమంతా వారి బంగారు భవిష్యత్ కోసమే. సంపాదించే ప్రతి రూపాయిని సరైన దారిలో ఇన్వెస్ట్ చేస్తేనే భధ్రతతో పాటు భరోసా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీలో పెట్టుబడి పెడితే చింత ఉండదు. పైగా మన పెట్టుబడికి దాదాపు రెట్టింపు డబ్బు మన చేతికి వస్తుంది. ఇది వారి పై చదువులకు లేదా వారి పెళ్లిళ్లకు ఉపయోగపడుతుంది. కనుక ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచిది.
పాలసీ వివరాలకు చూస్తే..
దీని పేరు చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ 832. ఇందులో రోజుకు రూ.206 పెట్టుబడి పెడితే పాలసీ మెచ్యూరిటీ సమయంలో రూ.27 లక్షలు పొందవచ్చు. పాలసీ గడువు 25 ఏళ్లు. ఉదాహరణకు మీ పాపకు ఏడాది వయసు వుంటే ఈ పాలసీ తీసుకుని రోజుకు రూ.206లు కడితే పాపకు 25 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత రూ.27 లక్షలు ఆమె చేతికి వస్తాయి. పాపకు 5 సంవత్సరాలు ఉన్నట్లైతే 20 ఏళ్ల తరువాత మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. అయితే ఈ పాలసీని 0-12 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. పాలసీ ప్రీమియంని ప్రతి నెలా లేదా 3 నెలలు, 6 నెలలు, ఏడాదికి ఒకసారి చెల్లించే వెసులుబాటు ఉంది.మరిన్ని వివరాలకు ఈ నెంబర్ 00919949322175 కి కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









